కోటి మందికి తెలుగు నేర్పే య‌త్నంలో కంచిస్వామి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (11:40 IST)
దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు నేర్పడానికి ఒక అంతర్జాతీయ సంస్ద అవసరమని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంధ్ర సరస్వతి స్వామి సూచించారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్ కంచిలో స్వామీజిని కలసి తెలుగు భాషా సంస్కృతుల వికాసంపై చర్చించారు.

తమిళనాడులో ఉన్న కోటి మంది పైగా ఉన్న తెలుగు వారికి సులభ తెలుగు పేరిట తెలుగు నేర్పే కార్యక్రమం చేపట్టి, తెలుగు ప్రాంతాలతో సంబంధ, బాంధవ్యాలు కలిపే ప్రయత్నం చేస్తున్నామని కంచి స్వామీజీ తెలిపారు. తిరువాయూరులో త్యాగరాజు ఆరాధనోత్సవాలు వలె తాళ్లపాకలో అన్నమయ్య సంకీర్తనోత్సవాలు నిర్వహించే యోచన చేస్తున్నామని స్వామి వారు తెలిపారు.

భుక్తి కోసం పరాయి భాషలు నేర్చుకోవచ్చు, వ్యక్తిత్వాన్ని సంతరింప చేసేది మాత్రం మాత్రృభాషన్న విషయం మరువకూడదని అన్నారు. బుద్ద ప్రసాద్ తాము ఇటీవల ఖండకావ్య పోటీలు నిర్వహిస్తే, 125 కావ్యాలు పోటీకి వచ్చాయని తెలిపితే స్వామివారు సంతోషం వ్యక్తం చేశారు.

కంచి పీఠం పిల్లలకు పద్యల పోటీలు నిర్వహిస్తుందని, నీతి, భక్తి శతక పద్యాలు, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడతాయని, పద్యం తెలుగువారి ఆస్తి అన్నారు. తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి మీరు చేస్తున్నసేవ గమనిస్తున్నానని బుద్దప్రసాద్ కి ఆశీస్సులు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments