Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ మారారుగా.. రూ.25 లక్షలు కప్పం కట్టండి.. దంపతులకు వైకాపా నేతల వేధింపులు

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (09:40 IST)
అధికార వైకాపాలో ఉండలేక విపక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన కౌన్సిలర్ల దంపతులకు వైకాపా నేతల నుంచి బెదిరింపులు మరింతగా ఎక్కువైపోయాయి. పైగా, పార్టీ మారినందుకు రూ.25 లక్షలు కప్పం కట్టాలంటూ వేధిస్తున్నారు. ఈ ఘటన కడప జిల్లా కమలాపురం పురపాలక సంఘంలో జరిగింది. ఈ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా నీలం ప్రమీల ఉన్నారు. ఈమె తన భర్త నీలం నరేంద్రతో కలిసి టీడీపీలో చేరారు. అంతే.. వైకాపా నేతలు ఒక్కసారిగా వారిని వేధించడం మొదలుపెట్టారు. నరేంద్రపై రెండు తప్పుడు అత్యాచారం కేసులు నమోదు చేయించారు. ఓ కేసులో మూడు రోజులు జైలుకెళ్లి వచ్చారు. మరో హత్య కేసులోనూ ఇరికించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైగా, కౌన్సిలరుగా గెలిపించడానికి రూ.25 లక్షలు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని దౌర్జన్యానికి దిగుతున్నారు. చివరికి ఫోర్జరీ సంతకంతో కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం తీర్మానాన్ని ఆమోదించారు. కానీ, తాను రాజీనామా చేయలేదని అధికారులకు ప్రమీల మొరపెట్టుకున్నారు.
 
వైకాపాలో నాయకుల వేధింపులకు తట్టుకోలేకపోతున్నామని కమలాపురం 20వ వార్డు కౌన్సిలరు నీలం ప్రమీల, ఆమె భర్త నరేంద్ర తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో గత నెల 18న ఆ పార్టీలో చేరారు. వెంటనే నలుగురు వైకాపా నేతలు కౌన్సిలరు ఇంటికి వెళ్లి.. ఆమెను గెలిపించడానికి ఖర్చయిన రూ.25లక్షలు చెల్లించాలని, లేదంటే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. 
 
ఈలోపు.. మహిళా, శిశుసంక్షేమ సంఘం జిల్లా ఛైర్‌పర్సన్‌ పి.మేరీ.. తన ట్రాక్టరు డ్రైవరు పోలీసుల అదుపులో ఉండటంతో వారిని కలిశారు. ఈ సమయంలో ఎస్‌.ఐ. చిన్నపెద్దయ్య తెల్ల కాగితంపై సంతకం చేయాలని కోరగా ఎందుకని ఆమె ప్రశ్నించారు. జామీను కోసమంటూ అడిగి ఖాళీ కాగితంపై సంతకం చేయించుకున్నారు. తర్వాత మేరీపై నీలం నరేంద్ర అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదు చేసి, అరెస్టుచేశారు. దాంతో.. తాను చేయని ఫిర్యాదు ఆధారంగా నరేంద్రపై కేసు ఎలా పెడతారని ఎస్‌ఐని మేరీ ప్రశ్నించారు.
 
ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి, నరేంద్రపై తాను ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కమలాపురం కోర్టు జడ్జి ముందూ వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం జైల్లో ఉన్న నరేంద్ర విడుదలయ్యారు. ఇటీవల నియోజకవర్గంలో ఓ వైకాపా నేత హత్యకు గురయ్యారు. ఈ కేసులో నరేంద్రను అనుమానితునిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 
 
ఈలోపు నీలం ప్రమీల రాజీనామా చేసినట్లు ఫోర్జరీ సంతకంతో పత్రాన్ని రాసి పురపాలక సంఘం ఎజెండాలో చేర్చారు. మంగళవారం జరిగిన సమావేశంలో దీన్ని ఆమోదించారని ప్రమీల ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధికారులపై న్యాయపోరాటం చేస్తానన్నారు. తాను ఆరోగ్యంతో ఉన్నా.. అనారోగ్యం వల్ల రాజీనామా చేశానని చిత్రీకరించడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారం కమలాపురంలో సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments