Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన, సోలార్ విద్యుత్పుత్తిలో మనమే ఫస్ట్... కళా వెంకట్రావు

అమరావతి : పవన, సోలార్ విద్యుత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావు తెలిపారు. మొత్తం విద్యుత్ గ్రిడ్ డిమాండ్‌లో 11-07-2018 రోజున పవన, సోలార్ విద్యుత్పత్తి 50 శాతంతో అధిగమించాము. సచివాలయంలోని తన కార్య

Webdunia
గురువారం, 12 జులై 2018 (20:51 IST)
అమరావతి : పవన, సోలార్ విద్యుత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావు తెలిపారు. మొత్తం విద్యుత్ గ్రిడ్ డిమాండ్‌లో 11-07-2018 రోజున పవన, సోలార్ విద్యుత్పత్తి 50 శాతంతో అధిగమించాము. సచివాలయంలోని తన కార్యాలయంలో రోజువారీ విద్యుత్ వినియోగం నివేదికపై జరిపిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సంప్రదాయేతర ఇంధన వనరులైన పవన, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనివల్ల ఆ రెండు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి ఘణనీయంగా పెరిగిందన్నారు. 
 
2014లో తమ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉండేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన విద్యుత్ సంస్కరణల కారణంగా నేడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా సగటున 149 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందన్నారు. ఇందుకనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. 149 మిలియన్ యూనిట్లలో పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 74.58 మిలియన్ యూనిట్లు ఉన్నాయన్నారు. వాటిలో పవన విద్యుత్ వాటా 66.41 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్ ద్వారా 8.17 మిలియన్ యూనిట్లు ఉత్పత్తవుతోందన్నారు. 
 
మొత్తం ఉత్పత్తిలో 50 శాతం వాటా పవన, సోలార్ విద్యుత్తేనని మంత్రి కళా వెంకటరావు తెలిపారు. భవిష్యత్తులో వాటి వాటా శాతం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 2017-18 సంవత్సరంలో పవన, సోలార్ విద్యుత్ వాటా 18 శాతం ఉండగా, 2018-19 సంవత్సరంలో 25 శాతం పైబడి వస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖలో వాణిజ్యపరమైన నష్టాలను 10.4 శాతానికి తగ్గించగలిగామని మంత్రి కళా వెంకటరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments