Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసింది.. కత్తితో పీకకోసి చంపేశా...

కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసిన ఓ మహిళను ఓ యువకుడు కత్తితో పీకకోసి చంపేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాకినాడ సమీపంలోని అల్లవరం మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:22 IST)
కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసిన ఓ మహిళను ఓ యువకుడు కత్తితో పీకకోసి చంపేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాకినాడ సమీపంలోని అల్లవరం మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మండలంలోని ఓడలరేవులకు చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు దుబాయ్‌లో పని చేస్తున్నాడు. ఈ యువకుడు స్థానికంగా ఉండే పొనమండ కృష్ణకుమారి(45) అనే మహిళ కుమార్తెను ప్రేమించాడు. ఈ విషయం కృష్ణకుమారికి చెప్పాడు. పైగా, దుర్గా ప్రసాద్ దుబాయ్‌లో పని చేస్తూ నాలుగు పైసలు సంపాదిస్తుండటతో కృష్ణకుమారి కూడా సమ్మతించింది. ఆ తర్వాత దుబాయ్ నుంచి కృష్ణకుమారికి దుర్గా ప్రసాద్ పలుమార్లు డబ్బులు కూడా పంపించాడు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల స్వదేశానికి తిరిగివచ్చిన దుర్గాప్రసాద్.. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిని ఇవ్వాలని కృష్ణకుమారి వద్దకు వెళ్లి అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కృష్ణకుమారిపై దుర్గాప్రసాద్ కోపం పెంచుకున్నాడు. అదునుకోసం వేచిచూసి మంగళవారం ఉదయం కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అలాగే పీకకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments