Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసింది.. కత్తితో పీకకోసి చంపేశా...

కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసిన ఓ మహిళను ఓ యువకుడు కత్తితో పీకకోసి చంపేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాకినాడ సమీపంలోని అల్లవరం మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:22 IST)
కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసిన ఓ మహిళను ఓ యువకుడు కత్తితో పీకకోసి చంపేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాకినాడ సమీపంలోని అల్లవరం మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మండలంలోని ఓడలరేవులకు చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు దుబాయ్‌లో పని చేస్తున్నాడు. ఈ యువకుడు స్థానికంగా ఉండే పొనమండ కృష్ణకుమారి(45) అనే మహిళ కుమార్తెను ప్రేమించాడు. ఈ విషయం కృష్ణకుమారికి చెప్పాడు. పైగా, దుర్గా ప్రసాద్ దుబాయ్‌లో పని చేస్తూ నాలుగు పైసలు సంపాదిస్తుండటతో కృష్ణకుమారి కూడా సమ్మతించింది. ఆ తర్వాత దుబాయ్ నుంచి కృష్ణకుమారికి దుర్గా ప్రసాద్ పలుమార్లు డబ్బులు కూడా పంపించాడు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల స్వదేశానికి తిరిగివచ్చిన దుర్గాప్రసాద్.. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిని ఇవ్వాలని కృష్ణకుమారి వద్దకు వెళ్లి అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కృష్ణకుమారిపై దుర్గాప్రసాద్ కోపం పెంచుకున్నాడు. అదునుకోసం వేచిచూసి మంగళవారం ఉదయం కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అలాగే పీకకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments