Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబాయ్‌తో యువతి ప్రేమ వివాహం.. గొంతుకోసి చంపేసిన తండ్రి...

తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. కనిపెంచిన కుమార్తె తమకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కత్తి తీసుకుని కుమార్తె గొంతు కోసి చ

బాబాయ్‌తో యువతి ప్రేమ వివాహం.. గొంతుకోసి చంపేసిన తండ్రి...
, గురువారం, 23 ఆగస్టు 2018 (09:42 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. కనిపెంచిన కుమార్తె తమకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కత్తి తీసుకుని కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సీ కాలనీకి చెందిన విజయ అనే యువతి వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ దంపతులు ఊరి నుంచి దూరంగా వెళ్లి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తన అత్త చనిపోవడంతో విజయ సొంత ఊరికి వచ్చింది. 
 
ఈ విషయం తెలుసుకున్న విజయ కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి ఆమెతో గొడవ పెట్టుకున్నారు. అయితే ఈ పెళ్లి వ్యవహారంతో ఊర్లో తన పరువు పోయిందని భావించిన తండ్రి విజయను కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. కుమార్తె నిండు గర్భిణి అని కూడా చూడకుండా చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో భార్య.. మరో గదిలో పరాయి మహిళతో రాసలీలలు...