Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్ శుభ్రం చేస్తూ ఊపిరాకడక చనిపోయిన కార్మికులు - ఏడుగురు మృతి

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (11:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకును శుభ్రం చేసేందుకు అందులో దూకిన ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. ట్యాంకును శుభ్రం చేసే క్రమంలో ఒకరి వెనుక మరొకరు లోపలికి దిగారు. లోపల ఊపిరాడకపోవడంతో అందరూ చనిపోయారు. పెద్దపురం మండలం జి.రాంగపేటలోని అంబటి సబ్బయ్య ఫ్యాక్టరీలో ఈ దారుణం జరిగింది. 
 
జి.రాంగపేటలో ఆయిల్ ఫ్యాక్టరీని కొత్తగా కడుతున్నారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆయిల్ ట్యాంకు‌ను శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులు లోపలికి దిగారు. లోపలి ఊపిరి ఆడకపోవడంతో ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీసుకునిరావడానికి మరో ఇద్దరు కార్మికులు లోపలికి దిగగా వారు కూడా స్పృ కోల్పోయారు. ఇలా ఏడుగురు కార్మికులు ట్యాంక్ లోపలకు వెళ్లిప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన కార్మికులతో ఐదుగురు పాడేరు వాసులేనని అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని భావిస్తున్నారు. మిగతా ఇద్దరూ కార్మికులను పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన వారుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments