Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్ శుభ్రం చేస్తూ ఊపిరాకడక చనిపోయిన కార్మికులు - ఏడుగురు మృతి

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (11:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకును శుభ్రం చేసేందుకు అందులో దూకిన ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. ట్యాంకును శుభ్రం చేసే క్రమంలో ఒకరి వెనుక మరొకరు లోపలికి దిగారు. లోపల ఊపిరాడకపోవడంతో అందరూ చనిపోయారు. పెద్దపురం మండలం జి.రాంగపేటలోని అంబటి సబ్బయ్య ఫ్యాక్టరీలో ఈ దారుణం జరిగింది. 
 
జి.రాంగపేటలో ఆయిల్ ఫ్యాక్టరీని కొత్తగా కడుతున్నారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆయిల్ ట్యాంకు‌ను శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులు లోపలికి దిగారు. లోపలి ఊపిరి ఆడకపోవడంతో ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీసుకునిరావడానికి మరో ఇద్దరు కార్మికులు లోపలికి దిగగా వారు కూడా స్పృ కోల్పోయారు. ఇలా ఏడుగురు కార్మికులు ట్యాంక్ లోపలకు వెళ్లిప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన కార్మికులతో ఐదుగురు పాడేరు వాసులేనని అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారని భావిస్తున్నారు. మిగతా ఇద్దరూ కార్మికులను పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన వారుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments