Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకలపూడి సెజ్‌లో పేలుడు - ఇద్దరు మృతి

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (17:59 IST)
కాకినాడ గ్రామీణ పరిధిలోని వాకలపూడి పారిశ్రామికవాడ ప్రాంతంలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ రిఫైనరీలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు విద్యుదాఘాతం కారణంగా సంభవించినట్టు తెలుస్తోంది. గోదాంలో చక్కెర బస్తాలు లోడు చేస్తుండగా, కన్వేయర్ బెల్టుకు విద్యుత్ కలెక్షన్ ఇచ్చే సందర్భంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 
 
ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ (36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వర రావు (45)గా గుర్తించారు. 
 
గాయపడిన వారిని పిఠాపురం చంద్రాడ గ్రామానికి చెందిన బండి వీర వెంకట రమణ (28) పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన్ను కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 8 మందిని కాకినాడ నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments