Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకలపూడి సెజ్‌లో పేలుడు - ఇద్దరు మృతి

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (17:59 IST)
కాకినాడ గ్రామీణ పరిధిలోని వాకలపూడి పారిశ్రామికవాడ ప్రాంతంలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ రిఫైనరీలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు విద్యుదాఘాతం కారణంగా సంభవించినట్టు తెలుస్తోంది. గోదాంలో చక్కెర బస్తాలు లోడు చేస్తుండగా, కన్వేయర్ బెల్టుకు విద్యుత్ కలెక్షన్ ఇచ్చే సందర్భంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 
 
ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ (36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వర రావు (45)గా గుర్తించారు. 
 
గాయపడిన వారిని పిఠాపురం చంద్రాడ గ్రామానికి చెందిన బండి వీర వెంకట రమణ (28) పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన్ను కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 8 మందిని కాకినాడ నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments