Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకలపూడి సెజ్‌లో పేలుడు - ఇద్దరు మృతి

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (17:59 IST)
కాకినాడ గ్రామీణ పరిధిలోని వాకలపూడి పారిశ్రామికవాడ ప్రాంతంలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ రిఫైనరీలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు విద్యుదాఘాతం కారణంగా సంభవించినట్టు తెలుస్తోంది. గోదాంలో చక్కెర బస్తాలు లోడు చేస్తుండగా, కన్వేయర్ బెల్టుకు విద్యుత్ కలెక్షన్ ఇచ్చే సందర్భంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 
 
ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ (36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వర రావు (45)గా గుర్తించారు. 
 
గాయపడిన వారిని పిఠాపురం చంద్రాడ గ్రామానికి చెందిన బండి వీర వెంకట రమణ (28) పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన్ను కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 8 మందిని కాకినాడ నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments