Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (12:49 IST)
వైకాపా సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలోని ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళే రహదారిపై అక్రమంగా టోల్ ప్లాజా ఏర్పాటు చేసి కంటైయినర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీ పోలీసులు మరో కేసును నమోదు చేశారు. 
 
ఇదిలావుంటే అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై మరో కేసు నమోదు చేయడం గమనార్హం. అలాగే, అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి బెయిల్ వస్తుందా? రాదా? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వేళ బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments