Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఐకు బెదిరింపులు - మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

Advertiesment
kakani

ఠాగూర్

, మంగళవారం, 7 జనవరి 2025 (10:37 IST)
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐను బెదిరించిన కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 27వ తేదీన పోలీసులు ఈ కేసు నమోదు చేయగా, ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి ముఖ్య అనుచరుడు, వెంకటాచలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మండల వెంకట శేషయ్య తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 
 
దీనిపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే సీఐ పచ్చ చొక్క ధరించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చుట్టూ తిరగాల్సి ఉంటుందంటూ బహిరంగ హెచ్చరికలు చేశారు. దీంతో పోలీసులను బెదిరించారని, కేసు విచారణ సక్రమంగా సాగకుండా నిర్వీర్యం చేయాలని చూశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెచ్ఎంపీవి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. లక్షణాలు.. చికిత్స... జాగ్రత్తలు ఏంటి?