Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లెక్సీపై నా ఫోటో ఎందుకు వేయలేదు.. సిబ్బందిపై వైకాపా ఎమ్మెల్యే తిట్ల దండకం

Webdunia
గురువారం, 11 మే 2023 (09:02 IST)
ఏపీలో అధికార వైకాపా ఎమ్మెల్యేలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను దుర్భాషలాడుతున్నారు. వారిపై బూతు పురాణం చదువుతున్నారు. పై స్థాయి అధికారులు ఆదేశాల మేరకు కింది స్థాయి అధికారులు నడుచుకుంటున్నారు. అయితే, ఇవేమీ పట్టనట్టుగా వారు చిరుద్యోగులపై రెచ్చిపోతున్నారు. 
 
తాజాగా మచిలీపట్నం జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు వంతు వచ్చింది. గ్రంథాలయ ఉద్యోగులను దుర్భాషలాడారు. గ్రంథాలయాల్లో విద్యార్థులకు ప్రభుత్వం వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తన ఫొటోలేదని ఎమ్మెల్యేకు తెలిసింది. 
 
సదరు గ్రంథాలయ మహిళా అధికారిణిని ఎమ్మెల్యే నాగేశ్వర రావు మంగళవారం తన కార్యాలయానికి పిలిపించి, ఫ్లెక్సీపై తన ఫొటో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఆ ఫ్లెక్సీలు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి వచ్చాయంటూ ఆమె సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే. 'ఎవడాడు... మీపై అధికారి ఫోన్ నంబర్ ఇవ్వు..' అంటూ రగిలిపోయారు. 
 
మచిలీపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థలో పనిచేసే యూడీసీకి ఫోన్ చేసి తిట్ల దండకం అందుకున్నారు. ప్లెక్సీపై స్థానిక ఎమ్మెల్యే ఫొటో ఉండనవసరం లేదా.. అంటూ దూషించారు. కార్యదర్శిపై సైతం ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోయారు. చివరకు ఎమ్మెల్యే, ఎంపీపీ ఫొటోలతో కొత్త ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో ఆయన శాంతించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments