Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మహిళ హత్యకు దారితీసిన 'సరదా మాట'... ఏంటది?

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (09:17 IST)
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మాయిలను లేదా మహిళలను ఎవరైన పురుషుడు... నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సరదాగా అడుతుంటాడు. ఇపుడు ఇలాంటి సరదా మాటే ఓ మహిళ హత్యకు దారితీసింది. ఈ దారుణం కడప జిల్లా పులివెందులలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, పులివెందుల పట్టణానికి చెందిన నాగమ్మ అనే మహిళ లింగాల మండలం పెద్దకూడాల శివారుల్లో గొర్రెలను మేపుతోంది. అక్కడే ఆమె ఇటీవల హత్యకు గురైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో హత్యకు గల కారణాలను పోలీసులు ఛేదించారు. హత్యకు ముందు రోజు నాగమ్మ మైనర్లతో మాట్లాడుతూ.. తనను పెళ్లి చేసుకుంటావా అని సరదాగా ప్రశ్నించింది. 
 
ఆ ప్రశ్నకు కోపగించుకున్న వారు.. మరుసటి రోజు ఆమె గొర్రెలు మేపుతున్న చోటుకి వెళ్లి గొడవ పడ్డారు. ఈ గొడవలోనే ఆమెను బండరాయితో కొట్టి చంపారు. 
 
వారిద్దని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జిల్లా బాలల నేరస్తుల గృహానికి తరలిస్తామని తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments