Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి పాలనకు కుట్రపన్నాయి.. అసదుద్దీన్ హెచ్చరించడంతో బతికిపోయా : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా విపక్ష పార్టీలు కుట్ర పన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (09:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా విపక్ష పార్టీలు కుట్ర పన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విపక్షాలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు యత్నించాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాగానే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర రాజకీయాలకు తెర తీశాయని ఆయన ఆరోపించారు. 
 
తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నించిన ఆ రెండు పార్టీలు... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పెట్టించే పన్నాగం పన్నాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాము ఈ కుట్రలను పసిగట్టలేకపోయామని కూడా కేసీఆర్ అన్నారు. ఈ సమయంలోనే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనకు ఫోన్ చేసి ఈ కుట్రలను వివరించారన్నారు. విపక్షాల కుట్రలపై అప్రమత్తం చేయడంతోనే సరిపెట్టుకోని ఒవైసీ... విపక్షాల కుట్రలకు చెక్ పెట్టేలా తమకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చి, ఆ విధంగానే ఆయన నడుచుకుంటున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments