Webdunia - Bharat's app for daily news and videos

Install App

విభజించు - పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్న పాలకులు : పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (15:40 IST)
తమ అవసరాలకు తగినట్టుగా రాజకీయ నేతలు, పాలకులు మాట మార్చేస్తుంటారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంటే విభజించు పాలించు అనే సిద్ధాంతంతో నేతలు ముందుకు పోతున్నారన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలోనూ అదే జరిగిందన్నారు. 
 
మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో క్రియాశీల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ విభజించి పాలించే విధానంతో పాలకులు వెళ్తున్నారని, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయమన్నారు. ఈ విషయంలో మరో మాటకు తావులేదన్నారు.
 
అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాదన్నారు. ప్రజలు కోల్పోయిన వాటిని అందజేయడమేనని, అది జనసేన చేస్తుందన్నారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా.. పరిష్కరిద్దామన్న ఆలోచన పాలకులు, అధికార పక్షంలో లేదని విమర్శించారు. 
 
తనకు సమస్యల నుండి పారిపోవడం తెలియదని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. దేనిపైనైనా అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా చెబుతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments