Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వరద బాధితుల కోసం టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (19:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులు రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 
 
ఇదే అంశంపై జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులను ఆదుకునేందుకు నా వంతుగా ఇది చిన్న సాయమని పేర్కొన్నారు. అలాగే, చిరంజీవి, మహేష్ బాబులు కూడా ఆర్థిక సాయం ప్రకటించారు.
 
కాగా, ఇటీవల ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా, పంటలు దెబ్బతిన్నాయి. భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వీరిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం