Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వరద బాధితుల కోసం టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (19:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులు రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 
 
ఇదే అంశంపై జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులను ఆదుకునేందుకు నా వంతుగా ఇది చిన్న సాయమని పేర్కొన్నారు. అలాగే, చిరంజీవి, మహేష్ బాబులు కూడా ఆర్థిక సాయం ప్రకటించారు.
 
కాగా, ఇటీవల ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా, పంటలు దెబ్బతిన్నాయి. భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వీరిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం