Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారు?: జోగి రమేష్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (19:39 IST)
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయితే పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి పొత్తులపై చర్చించేవారని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అన్నారు. బీజేపీతో చేతులు కలుపుతూనే.. టీడీపీతో పవన్ కలుస్తున్నారని విమర్శించారు. 
 
స్కిల్ స్కాంలో పవన్ పాత్ర కూడా ఉందని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాల్లో పవన్ భాగస్వామినా? అని నిలదీశారు.
 
పవన్, చంద్రబాబు మళ్లీ కలవడం ఏంటి? చంద్రబాబు చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసని, చేసిన పాపాలకు చంద్రబాబు జైలుకెళ్లారన్నారు. వైఎస్‌ జగన్‌తో యుద్ధం అంటే 5 కోట్ల మంది ప్రజలతో చేసే యుద్ధం అని తెలిపారు.
 
కోట్లాది మంది డ్వాక్రా అక్కాచెల్లెళ్లు, 66 లక్షల మంది తాతలు, వితంతువులు, వికలాంగులపై చేస్తున్న పోరాటమని జోగి వెల్లడించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.
 
తండ్రి జైల్లో ఉంటే కొడుకు లోకేష్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడానికి సిగ్గుపడాలి. ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకునేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments