Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటిని ఇడియట్స్ మాత్రమే అంగీకరిస్తారు... లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (18:37 IST)
ఏపీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత లక్ష్మీనారాయణ పార్టీకి దూరంగా ఉండటంతో, ఆయన పార్టీని వీడుతున్నట్టు కొంతకాలంగా ఊహాగానాలు మొదలయ్యాయి. 
 
తాజాగా ఆయన తన సన్నిహితుడు గంపల గిరిధర్‌తో కలిసి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన లక్ష్మీనారాయణ... తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
 
అలాగే జనసేన నుంచి వీడనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత లక్ష్మీనారాయణ స్పందించారు. ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వార్తలను అంగీకరించేవారు ఇడియట్స్ మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందని భావించినన్ని రోజులు తాను పార్టీలోనే ఉంటానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోనని, సమయాన్ని వృధా చేసుకోనని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments