Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం : జేసీ ప్రభాకర్ రెడ్డి

Webdunia
గురువారం, 11 జులై 2019 (12:34 IST)
త్వరలోనే బీజేపీ పార్టీలో తమ పార్టీ విలీనమవుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బిజెపితో తాళి కట్టించుకుంటామని, బిజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామన్నారు. 
 
ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతం కొత్తగా బీజేపీతో జతకట్టడం లేదని, గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామని, ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామని జెసి అన్నారు. 
 
ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా టీడీపీ మొత్తం బీజేపీతో కలిపిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. 
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ సీఎం చంద్రబాబు సలహాలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటించిన నేపథ్యంలోజేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ చేరిన విషయం తెలిసిందే. జెసి బ్రదర్స్‌కు బిజెపి నుంచి ఆహ్వానం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments