Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మహాత్మా గాంధీ కాదు.. ఆయన ఒక్కడి వల్లే టీడీపీ గెలవలేదు : జేసీ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఈ కామెంట్స

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (15:14 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఈ కామెంట్స్ చేశారు. 
 
ఆయన మంగళవారం విజయవాడలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ చంద్రబాబు ఒక్కడి వల్లే అధికారంలోకి రాలేదన్నారు. చంద్రబాబు పిలిస్తే జనాలు (ప్రజలు) వచ్చేందుకు ఆయనేం మహాత్మా గాంధీ కాదని అన్నారు. 
 
వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడని, జగన్ సీఎం అయితే రాష్ట్రానికి మంచిది కాదన్న ఉద్దేశ్యంతోనే తాను టీడీపీలో చేరానని, ఈ విషయాన్ని తాను ఆనాడే చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

రాష్ట్రాన్ని అధికారులతో చంద్రబాబు పాలిస్తున్నారని అన్నారు. అధికారుల రాజ్యం వద్దని చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని... పద్దతి మార్చుకోకపోతే చంద్రబాబుకు ఇబ్బంది తప్పదని ఆయన అన్నారు. పయ్యావుల కేశవ్‌వంటి నాయకులకే గుర్తింపు లేకపోతే తమలాంటి వాళ్ల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments