Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మహాత్మా గాంధీ కాదు.. ఆయన ఒక్కడి వల్లే టీడీపీ గెలవలేదు : జేసీ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఈ కామెంట్స

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (15:14 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆయన ఏకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఈ కామెంట్స్ చేశారు. 
 
ఆయన మంగళవారం విజయవాడలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ చంద్రబాబు ఒక్కడి వల్లే అధికారంలోకి రాలేదన్నారు. చంద్రబాబు పిలిస్తే జనాలు (ప్రజలు) వచ్చేందుకు ఆయనేం మహాత్మా గాంధీ కాదని అన్నారు. 
 
వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడని, జగన్ సీఎం అయితే రాష్ట్రానికి మంచిది కాదన్న ఉద్దేశ్యంతోనే తాను టీడీపీలో చేరానని, ఈ విషయాన్ని తాను ఆనాడే చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

రాష్ట్రాన్ని అధికారులతో చంద్రబాబు పాలిస్తున్నారని అన్నారు. అధికారుల రాజ్యం వద్దని చంద్రబాబుకు చాలా సార్లు చెప్పానని... పద్దతి మార్చుకోకపోతే చంద్రబాబుకు ఇబ్బంది తప్పదని ఆయన అన్నారు. పయ్యావుల కేశవ్‌వంటి నాయకులకే గుర్తింపు లేకపోతే తమలాంటి వాళ్ల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments