Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగి ఇద్దరు మహిళల మృతి: టీలో పురుగుల మందు ఎలా కలిసింది?

టీకి వేళాయె అనుకుని వేడి వేడి టీని తాగారు. అయితే టీ రూపంలో ఇద్దరు మహిళలను యముడు వెతుక్కుంటూ వచ్చాడు. టీ తాగిన పాపానికి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (15:12 IST)
టీకి వేళాయె అనుకుని వేడి వేడి టీని తాగారు. అయితే టీ రూపంలో ఇద్దరు మహిళలను యముడు వెతుక్కుంటూ వచ్చాడు. టీ తాగిన పాపానికి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని సొత్వా గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన వారంతా సోమవారం టీ తాగిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. 
 
పురుగు మందు కలిసిన టీని తాగేయడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా అనారోగ్యం పాలైయ్యారని డీఎస్పీ శివకుమార్ రౌత్ చెప్పారు. ఆ టీలో పురుగుమందు కలిసిందని ఆయన వివరించారు. ఈ ఘటనలో  దీంతో జస్వంతి దేవి (65), ఆమె కుమార్తె షీలా దేవి (45) మరణించారని, మరో ఆరుగురు అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. 
 
మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, అనారోగ్యానికి గురైన వారికి ఆస్పత్రిలో చేయిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. టీలో పురుగుల మందు ఎలా కలిసిందనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. 

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో అశ్విన్ బాబు శివం భజే చిత్రం

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో

ఆ గాయంతోనే నింద షూటింగ్ చేశాను : హీరో వరుణ్ సందేశ్

సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్, పాటలు బాగున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments