Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడికి అన్నీ తెలుసు... తెలియదనుకోవడం మన అవివేకం.. జగన్‌పై జేసీ కామెంట్స్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. వాడికి (జగన్) అన్నీ తెలుసని, వాడికి ఏమీ తెలియదు అనుకోవడం మన అవివేకమన్నారు.

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (09:44 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. వాడికి (జగన్) అన్నీ తెలుసని, వాడికి ఏమీ తెలియదు అనుకోవడం మన అవివేకమన్నారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టారంటూ జగన్ ఢిల్లీలో పలువురుని కలుస్తుండటంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురంలో మరోమారు స్పందించారు. 
 
ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్తే ఏం ప్రయోజనమన్నారు. రాష్ట్రపతి ఏం చేస్తారని, కాసిన్ని కాఫీ ఇచ్చి.. పరిశీలిస్తామంటూ చెప్పి పంపుతారని అన్నారు. దీని గురించి ఇక్కడున్న ముఖ్యమంత్రి వద్దకు కానీ, లేదా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వద్దకు కానీ వెళితే తగిన సమాధానం లభిస్తుందన్నారు. అన్నీ తెలిసిన పేర్లే అంటూ... ఊరికే వాళ్ల దగ్గరకు వెళ్లి చెప్పుకుంటే ఏం ప్రయోజనమన్నారు. 
 
మనం దేవుడి దగ్గరకు ఎందుకెళ్తాం... ఆపద్బాంధవా కాపాడు తండ్రీ అని మొక్కోవడానికి వెళ్తామని జేసీ అన్నారు. జగన్ కూడా అంతేనని... తనపై ఉన్న ఈడీ కేసుల నుంచి కాపాడాలని కోరుకోవడానికే ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి తప్పించండని అడుక్కోవడానికే మావాడు ఢిల్లీకి వెళ్లాడని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments