Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల నరికి ఒకచోట.. మొండేన్ని మరో చోట పెడతానంటున్న జగన్ : జేసీ

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (15:56 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని తరలింపు నిర్ణయం పిచ్చితుగ్లక్‌ తరహాలో తీసుకున్న నిర్ణయమని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మనిషి శరీరానికి తల ఎంత ముఖ్యమో... రాష్ట్రానికి రాజధానికి కూడా అంతే ముఖ్యమన్నారు. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తల నరికి ఒక చోట.. మొండేన్ని మరో చోట పెడతానని అంటున్నాడని ఎద్దేవా చేశారు. పైగా, తెలివి ఒక్కడి సొత్తు అనుకోవద్దనీ, ప్రతి ఒక్కరికీ ఉంటుందనే విషయాన్ని జగన్ గుర్తించుకోవాలని సలహా ఇచ్చారు. 
 
వాస్తవానికి రాజధాని అమరావతి అంటేనే దూరం అనుకున్నాం. కానీ, ఐదు కోట్ల మంది ప్రజలకు కేంద్రంగా ఉంటుందని తామంతా అమరావతికి మద్దతు పలికామన్నారు. ఇపుడు అమరావతి కాదని వైజాగ్ తీసుకెళ్ళతామంటే తాము ఎంతమాత్రం సహించబోమన్నారు. ఎందుకంటే.. అమరావతి కంటే వైజాగ్ చాలా దూరమని, అక్కడకు వెళ్లాలంటే రెండు రోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ కాదుగీదు అంటే గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమించడం ఖాయమని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments