Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం భారమే : టీడీపీ నేత జేసీ

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (16:09 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టి వందరోజులు పూర్తి చేసుకుంది. దీన్ని వైకాపా శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. అయితే, టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ మోహన్ రెడ్డిని చేయిపట్టుకుని నడిపించేవాడు కావాలన్నారు. అలాగే, ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూపి లోపాలను సరిద్దాలని కోరారు. అంతేగానీ, దాన్ని నేలకేసి కొట్టొద్దని ఆయన పిలుపునిచ్చారు. 
 
పైగా, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేదు కానీ, ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే అవుతుందన్నారు. అంతటితో ఆగని ఆయన..'మా వాడు చాలా తెలివైనవాడు..' అంటూ వైఎస్ జగన్‌కు జేసీ కితాబిచ్చారు. రాజధాని అమరావతిలోనే ఇక్కడే ఉంటుందని.. ఎక్కడికీ తరలిపోదని మాజీ ఎంపీ జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన వైకాపా వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో జేసీ దివాకర్ పోటీ చేయకుండా ఆయన కుమారుడిని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలోకి దించారు. కానీ, ఆయన ఫ్యాను గాలికి చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో జగన్ చెంతకు చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments