Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరం హైడెల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు.. ఆశావర్కర్ల వేతనాలు పెంపు.. ఏపి కేబినెట్ నిర్ణయం

పోలవరం హైడెల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు.. ఆశావర్కర్ల వేతనాలు పెంపు.. ఏపి కేబినెట్ నిర్ణయం
, బుధవారం, 4 సెప్టెంబరు 2019 (13:07 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీ మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో పరిశీలిద్ధాం. 
 
* నవయుగకు పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. 
* రూ.3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోదం. 
* రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ ఆమోదం.
* కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్‌ ఆమోదం.
* మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
* ఆశావర్కర్ల వేతనం పెంపునకు కేబినెట్‌ ఆమోదం. రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. 
 
* 2018 ఆగస్టు నుంచి రూ.1500 ఉన్న ఆశావర్కర్ల జీతం రూ.3 వేలకు పెంపు. మరో 3 వేల రూపాయలు ప్రతిభ ఆధారంగా నిర్దేశించిన అప్పటి ప్రభుత్వం ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.
* మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వృద్ధిరేటులో పాకిస్థాన్ కంటే వెనుకబడిన భారత్?