Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కోరిక నెరవేరదు.... జేసీ దివాకర్ రెడ్డి

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:44 IST)
దేశాన్ని మార్చడం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి చేతయ్యేది కాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం... మంగళవారం జంతర్‌‌మంతర్‌ దగ్గర ఎంపీ మాగంటి బాబు చేపట్టిన నిరాహారదీక్షకు టీడీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ను ప్రధానిని చేయాలన్న చంద్రబాబు కోరిక నెరవేరదనీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేస్తారన్న ఆశతో చంద్రబాబు రాహుల్‌ వెంట పడుతున్నారన్నారు.
 
ప్రధాని మోడీ ఒక ఫ్యాక్షన్‌ లీడర్‌లా, నియంతలా వ్యవహరిస్తున్నారనీ విమర్శించిన జేసీ రైల్వే జోన్‌ వల్ల ఏపీకి లాభం లేదనీ, ప్రభుత్వానికీ నష్టం లేదని ఆయన అన్నారు. కక్ష సాధించడం కోసమే కేంద్రం రైల్వేజోన్‌ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఉన్నంతవరకు ప్రజలకు సంక్షేమం అందుతుందని, ఎన్నికలకు ముందే రైతులకు చెక్కులు ఇస్తామనీ జేసీ దివాకర్‌ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments