Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిరత్నం దర్శకత్వంలో జయసుధ - నాని!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (13:50 IST)
స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందనుంది. అలాగే, హీరోయిన్లుగా జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లు ఉన్నారు. 
 
నిజానికి మణిరత్నం - అరవింద్ స్వామి కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. ప్రధానంగా 'రోజా', 'దళపతి', 'బొంబాయి', 'కాదల్' వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ తాజా మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
అయితే, ఈ మల్టీస్టారర్ చిత్రంలో సహజ నటి జయసుధతో పాటు నేచురల్ స్టార్ నాని కూడా కీలక పాత్రలను పోషించనున్నారేనే వార్తలు హల్ చేస్తున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది.
 
కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. అలాగే, సంతోష్ శివన్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. అయితే, తమిళ హీరోలు విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిలకు మణిరత్నం దర్శకత్వంలో నటించనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments