Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత పుట్టినరోజు.. రూ.2.9 కోట్ల కానుక: బ్యాంకులో జమ.. కేసు నుంచి విముక్తి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు పుట్టిన రోజు సందర్భంగా బహూకరించిన రూ.2.9 కోట్ల కానుకను తన బ్యాంకు ఖాతాలో జమ చేశారని దాఖలైన కేసు నుంచి ఊరట లభించింది.

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (09:45 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు పుట్టిన రోజు సందర్భంగా బహూకరించిన రూ.2.9 కోట్ల కానుకను తన బ్యాంకు ఖాతాలో జమ చేశారని దాఖలైన కేసు నుంచి ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ఆమె మరణించడంతో ఈ కేసు నుంచి ఇప్పటికే అమ్మ పేరు తొలగించబడిందని వార్తలు వస్తున్న తరుణంలో... పుట్టినరోజు కానుకను తన బ్యాంకు ఖాతాలో జమ చేశారని దాఖలైన కేసు నుంచి జయలలితను విడిపిస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1991 నుంచి 96 వరకు వ్యవహరించిన జయలలిత 1992వ సంవత్సరం తన జన్మదినాన్ని ఆడంబరంగా జరుపుకున్నారు. ఆమెకు పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు కోట్లు విలువ చేసే బహుమతులను కానుకలుగా అందజేశారు. అప్పుడు రూ.2 కోట్ల 9 లక్షల 50 వేల విలువ చెక్కును పంపిణీ చేశారు. సీఎం పదివిలో ఉన్న వ్యక్తి తనకు కానుకగా సమర్పించిన నిధిని ప్రభుత్వ ఖజానాకు అప్పగించాల్సి ఉంది. 
 
అయితే జయలలిత ఆ నిధులను తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నారని 1996వ సంవత్సరం సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఏళ్ల తరబడి విచారణలో పెండింగ్‌లో ఉన్నది. ఈ కేసులో జయలలిత, అప్పటి మంత్రులుగా ఉన్న అళగు తిరునావుక్కరసు, సెంగోట్టయన్‌లను ముద్దాయిలుగా చూపారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments