Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరుకు చేరుకున్న జ‌వాన్ సాయితేజ మృత‌దేహం

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:38 IST)
తమిళనాడు కున్నూరు సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం  చెందిన చిత్తూరు జిల్లా కురబలకొట మండలం రేగడ పల్లెకు చెందిన వీర జవాన్  సాయితేజ మృత దేహం క‌ర్నాట‌కు చేరుకుంది. బెంగ‌ళూరు ఎయిర్ బేస్ క్యాంపున‌కు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి జ‌వాన్ సాయితేజ మృత‌దేహం చేరుకుంది. సైనిక లాంఛ‌నాల‌తో మృత‌దేహాన్ని బెంగ‌ళూర్ బేస్ క్యాంప్ లోని మార్చురీకి త‌ర‌లించారు. రేపు ఉదయం చిత్తూరు జిల్లా కురబలకోట (మ) ఎగువరేగడు గ్రామంలో కుటుంబ సభ్యులకు సాయితేజ పార్థివ దేహం అప్పగించ‌నున్నారు.
 
 
వీర జవాన్  సాయితేజ మృత దేహం ఆదివారం ఉదయం వారి  స్వగ్రామానికి చేరుకుంటుందని, చిత్తూరు   జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. ఆదివారం రేగడపల్లెలో అధికార లాంఛనాలతో దహన క్రియలు జరుగుతాయ‌ని ఆయ‌న తెలిపారు. బెంగ‌ళూరు నుంచి ఉద‌యం ఇక్క‌డికి మృత‌దేహం చేరుతుంద‌ని చెప్పారు. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments