నాకు రోజూ ఇడ్లీ పెట్టారు.. బైకుపై తీసుకొచ్చి దింపేశారు... జషిత్ కిడ్నాప్ కథకు తెర

Webdunia
గురువారం, 25 జులై 2019 (09:07 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాలుగేళ్ళ బాలుడు జషిత్ కథ సుఖాంతమైంది. పోలీసుల ముమ్మర వేటతో పాటు.. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడంతో దిక్కుతోచని కిడ్నాపర్లు జషిత్‌ను తూర్పుగోదావరి జిల్లా కుతుకులూరు రోడ్డులో గురువారం తెల్లవారుజామున వదిలివెళ్లారు. 
 
తన కిడ్నాప్ గురించి జషిత్ పోలీసులకు కొంత సమాచారం అందించారు. 'నేను నిన్న ఏదో ఊరు దగ్గర ఉన్నాను. నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఒక అబ్బాయి వాళ్ల ఇంట్లో వదిలేశారు. వాళ్లలో ఒక అబ్బాయి పేరు రాజు. వాళ్లు నాకు రోజూ ఇడ్లీ పెట్టారు. రాజు అనే అబ్బాయి.. బైక్‌పై వచ్చి నన్ను దింపేశారు' అని చెప్పుకొచ్చాడు. 
 
కాగా, కిడ్నాపర్లు తూగో జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు రోడ్డులో అమ్మవారి గుడి ముందు బాలుడిని వదిలి వెళ్లారు. పోతూపోతూ స్థానికులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న క్వారీ కార్మికులు బాబుని గుర్తించారు. బాబుని వారు చేరదీశారు. తర్వాత రెడ్డి అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాబు శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆరోగ్యంగా, చలాకీగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు. 
 
కాగా, దిక్కుతోచని స్థితిలో బాబుని క్షేమంగా వదిలిపెట్టారని పోలీసులు చెబుతున్నారు. జసిత్‌ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. బాలుడి ఆచూకీ తెలియగానే ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. ఈ బాలుడు ఈ నెల 22వ తేదీన రాత్రి కిడ్నాప్‌కు గురైన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

తర్వాతి కథనం
Show comments