నాకు డబ్బులు కావాలి... సాయం చేయండి... జనసేనాని అభ్యర్థన

2019 ఎన్నికల బరిలో దిగాలని జనసేన గట్టి ఫిక్సయిన సంగతి తెలిసిందే. అందుకు ప్రజల మద్దతు ఒకటే సరిపోదని రియలైజయ్యింది. పార్టీని నడపడానికి డబ్బులు కూడా అవసరమని భావించి ఫండ్స్ సేకరించే పనిలో పడింది నాయకత్వం. పార్టీ ఫండ్స్ కోసం జనసేన కొత్త రూట్‌ను ఎంచుకుంది.

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (16:02 IST)
2019 ఎన్నికల బరిలో దిగాలని జనసేన గట్టి ఫిక్సయిన సంగతి తెలిసిందే. అందుకు ప్రజల మద్దతు ఒకటే సరిపోదని రియలైజయ్యింది. పార్టీని నడపడానికి డబ్బులు కూడా అవసరమని భావించి ఫండ్స్ సేకరించే పనిలో పడింది నాయకత్వం. పార్టీ ఫండ్స్ కోసం జనసేన కొత్త రూట్‌ను ఎంచుకుంది. విరాళాల కోసం ఏకంగా ఆన్‌లైన్‌లో కౌంటర్‌ను తెరిచారు. అసలేంటి జనసేన ప్లాన్? 
 
2014 సంవత్సరానికి జనసేన పార్టీ పెట్టారు. కానీ ఆ యేడాది ఎలక్షన్లలో పోటీకి దిగకుండా టిడిపికి, బిజెపికి మద్దతిచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. కానీ ఈసారి సీన్ మారిపోయింది. 2019 ఎన్నికలకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది జనసేన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్థమైంది జనసేన పార్టీ. అందుకోసం ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో ఉన్నారు పార్టీ నాయకులు. ఎలక్షన్లు దగ్గరపడుతున్నకొద్దీ పార్టీని నడిపేందుకు కార్యకర్తలు సరిపోరు, ఫండ్స్ కూడా కావాలని తెలుసుకున్నారు. 
 
అందుకు ఆన్‌లైన్‌లో డొనేషన్ల సేకరణ ప్రారంభించారు. ఇప్పటికే అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి ఆర్థిక, అంగబలాలతో ఎన్నికలకు రెడీగా ఉన్నాయి. కానీ జనసేన మాత్రం తమకు ప్రజల మద్దతే బలమన్న రీతిలో ఎలక్షన్లకు రెడీ అవుతోంది. అయితే ఎన్నికలంటే ఎంతో కొంత నిధులు అవసరం. అందుకే నేరుగా ప్రజల నుంచే విరాళాలను సేకరించేందుకు సిద్ధమైంది. స్వీకరించిన పార్టీ ఫండ్స్ ఎప్పుడూ ఎలా ఖర్చు పెట్టాలో కూడా డొనేషన్లు ఇచ్చేవారికి తెలియజేస్తామంటోంది జనసేన.
 
రాష్ట్రంలో జనసేన పార్టీ తరపున పోటీ చేసే ప్రతి అభ్యర్థికి ఎన్ఆర్ఐ నిధులు సమకూరేలా జనసేనాని ప్రణాళికలు రచిస్తున్నారట. ఈ బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌కు అప్పగించారట. ప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్లు ఇచ్చేందుకు భారీగా నిధులు సమకూర్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో అలాంటి పరిస్థితి జనసేనలో రాకుండా ప్రజల నుంచి, తనకు తెలిసిన ఎన్ఆర్ఐల నుంచి మాత్రమే విరాళాలు సేకరించాలన్న ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments