Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌ర్ స్టార్ ఇక ప్ర‌త్య‌క్ష‌పోరాటాల‌కు... నెల‌ఖ‌రులో చ‌ర్చ‌!

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (10:40 IST)
రాష్ట్రంలో దాష్టీక పాలన జరుగుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వర్చువల్ ద్వారా ఆయన మాట్లాడుతూ, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు అని అన్నారు. వైసిపి అరాచకాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పోరాటాలకు జనసేన సిద్ధం అవుతుందని వెల్లడించారు. 
 
ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో జనసేన బలంగా పొరాడిందని, తద్వారా 25.2% ఓట్లు సాధించాం అని పేర్కొన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేస్తుంటే, అధికార యంత్రాంగం చోద్యం చూసింది అని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
 
 దాడులు, బెదిరింపులతో వైసిపి నేతలు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నార‌ని ప‌వ‌న్ విమర్శించారు. వైసిపి దాష్టిక పాలనను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసిపి దాడులను ఎలా ఎదుర్కోవాలి? క్షేత్ర స్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో తమ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments