Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా నోటికి మున్సిపాలిటీ చెత్తకుప్పకి పెద్దగా తేడా లేదు..

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (13:25 IST)
ఏపీ మంత్రి రోజాపై మెగా బ్రదర్, జనసేన నేత కొణిదెల నాగబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా వీడియో రూపంలో రోజాపై మెగా బ్రదర్స్ మండిపడ్డారు. 
 
పర్యాటక శాఖ మంత్రి రోజా ది నోరు కాదు మున్సిపాలిటీ చెత్త కుప్ప అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టాప్ 20 ర్యాంకింగ్స్‌లో దేశంలో ఏపీ పర్యటక శాఖ 18వ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. రోజా బాధ్యతను విస్మరించి నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 
 
రాష్ట్ర పర్యటక శాఖ వల్ల ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రతుకుతున్నారని.. రోజా చేష్టల వల్ల వాళ్ల బ్రతుకులు మరింత దిగిజారిపోతున్నాయని మెగా బ్రదర్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని హితవు పలికారు. పర్యటక శాఖని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని.. రోజా నోటికి మున్సిపాలిటీ చెత్తకుప్పకి పెద్దగా తేడా లేదంటూ మండిపడ్డారు. అందుకే ఆమె ఏం మాట్లాడినా పెద్దగా రియాక్ట్ కాలేదంటూ తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments