జనసేనకు షాక్.. జేడీకి చుక్కెదురు.. కారణం ఏమిటి?

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (11:14 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో జనసేనకు చుక్కెదురైంది. అయితే వ్యక్తిగత ఇమేజ్‌తో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో దూసుకు వెళ్లిన జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ మూడో స్థానానికి పరిమితమయ్యారు. నిజాయతీపరుడైన పోలీసు అధికారిగా పేరుండడం, ప్రచారం సందర్భంగా ఆయన నిరాడంబరత్వం విశాఖ ఓటర్లను ఆకట్టుకున్నాయి. 
 
దీంతో జేడీకే ఓట్లు రాలుతాయని అందరూ అనుకున్నారు. ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తూ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. తటస్థ ఓటర్లను ఇది బాగా ఆకట్టుకుంది. కానీ అనూహ్యంగా మూడో స్థానానికి పరిమితం కావడం జనసైనికులకు షాకిచ్చింది. 
 
ఇందుకు కారణం ఏమిటంటే.. నగర ఓటర్లలో ఒక వర్గం లక్ష్మీనారాయణను బాగానే ఆదరించినప్పటికీ, గ్రామీణ ప్రాంత ఓటర్లు, మురికివాడల్లోని ఓటర్లు టీడీపీ, వైసీపీ పట్ల మొగ్గు చూపడం ఆయనకు మైనస్‌ అయ్యింది. విశాఖ నగరంలో దాదాపు 700 వరకు మురికి వాడలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు సరైన నాయకత్వ వ్యవస్థ లేకపోవడంతో ఆ పార్టీ కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments