Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీకి భారీ షాకిచ్చిన ఎన్నికల సంఘం ...

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (10:38 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీ గ్లాజు గుర్తును లాగేసుకుంది. దీన్ని ఫ్రీ సింబల్ జాబితాలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా జనసేన పార్టీ ఆ గుర్తును కోల్పోయింది. 
 
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు... ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నిల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం సాధించాల్సివుంది. దీంతో పాటు కనీసం రెండు సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. అపుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది.
 
అయితే, గత 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 9 శాతం ఓట్లు సాధించినప్పటికీ సీట్లు సాధించడంలో విఫలమైంది. ఫలితంగా ఆ పార్టీ తన ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది. పైగా, గతంలో బద్వేల్, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించింది. 
 
ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అయితే, న్యాయ నిపుణులతో చర్చించి, న్యాయపోరాటం చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments