Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీకి భారీ షాకిచ్చిన ఎన్నికల సంఘం ...

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (10:38 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీ గ్లాజు గుర్తును లాగేసుకుంది. దీన్ని ఫ్రీ సింబల్ జాబితాలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా జనసేన పార్టీ ఆ గుర్తును కోల్పోయింది. 
 
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు... ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నిల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం సాధించాల్సివుంది. దీంతో పాటు కనీసం రెండు సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. అపుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది.
 
అయితే, గత 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 9 శాతం ఓట్లు సాధించినప్పటికీ సీట్లు సాధించడంలో విఫలమైంది. ఫలితంగా ఆ పార్టీ తన ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది. పైగా, గతంలో బద్వేల్, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించింది. 
 
ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అయితే, న్యాయ నిపుణులతో చర్చించి, న్యాయపోరాటం చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments