Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు అది దోచేయడం బాగా తెలుసు: పవన్ కళ్యాణ్ విమర్శ

మానవతా దృష్టి ప్రభుత్వానికి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. బిందెడు ఆశ చూపి మూడు స్పూన్ల తీర్థం తాగించినట్లుగా రైతు రుణమాఫీ ఉందని టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించారాయన. తిరుపతి శివార్లలోని శెట్టిపల్లిలో జనసభలో

Webdunia
బుధవారం, 16 మే 2018 (17:42 IST)
మానవతా దృష్టి ప్రభుత్వానికి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. బిందెడు ఆశ చూపి మూడు స్పూన్ల తీర్థం తాగించినట్లుగా రైతు రుణమాఫీ ఉందని టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించారాయన. తిరుపతి శివార్లలోని శెట్టిపల్లిలో జనసభలో పవన్ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఎన్నోయేళ్ళుగా పంటలు వేస్తున్న రైతుల భూములను ఆర్థిక నగరి పేరుతో ప్రభుత్వం భూములను లాక్కోవడం దారుణమన్నారు. 
 
వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామన్నారు. పైడిపల్లికి న్యాయం చేసి శెట్టిపల్లికి ఎందుకు న్యాయం చేయరని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారని, తమ సమస్యలపై ప్రజలే ప్రభుత్వంపై ఎదురుతిరగాలని పవన్ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.
 
దోపిడీదారులకు తెలుగుదేశం పార్టీ కొమ్ముకాస్తోందని, వేల కోట్ల రూపాయల ప్రజా డబ్బును తెలుగుదేశం పార్టీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ విధానంలో మార్పు తీసుకురావాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. వీడియోలో ఆయన మాటలు చూడండి...

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments