చంద్రబాబుకు అది దోచేయడం బాగా తెలుసు: పవన్ కళ్యాణ్ విమర్శ

మానవతా దృష్టి ప్రభుత్వానికి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. బిందెడు ఆశ చూపి మూడు స్పూన్ల తీర్థం తాగించినట్లుగా రైతు రుణమాఫీ ఉందని టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించారాయన. తిరుపతి శివార్లలోని శెట్టిపల్లిలో జనసభలో

Webdunia
బుధవారం, 16 మే 2018 (17:42 IST)
మానవతా దృష్టి ప్రభుత్వానికి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. బిందెడు ఆశ చూపి మూడు స్పూన్ల తీర్థం తాగించినట్లుగా రైతు రుణమాఫీ ఉందని టిడిపి ప్రభుత్వాన్ని విమర్శించారాయన. తిరుపతి శివార్లలోని శెట్టిపల్లిలో జనసభలో పవన్ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఎన్నోయేళ్ళుగా పంటలు వేస్తున్న రైతుల భూములను ఆర్థిక నగరి పేరుతో ప్రభుత్వం భూములను లాక్కోవడం దారుణమన్నారు. 
 
వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామన్నారు. పైడిపల్లికి న్యాయం చేసి శెట్టిపల్లికి ఎందుకు న్యాయం చేయరని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్నారని, తమ సమస్యలపై ప్రజలే ప్రభుత్వంపై ఎదురుతిరగాలని పవన్ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.
 
దోపిడీదారులకు తెలుగుదేశం పార్టీ కొమ్ముకాస్తోందని, వేల కోట్ల రూపాయల ప్రజా డబ్బును తెలుగుదేశం పార్టీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ విధానంలో మార్పు తీసుకురావాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. వీడియోలో ఆయన మాటలు చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments