Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి దారిలో పెడతాం : జనసేన నేత నాగబాబు

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (17:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ - జనసేన - బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వంపై రోజుకో రీతిలో పిచ్చికుక్కల తరహాలో మాట్లాడుతున్న వైకాపా నేతకు ర్యాబిస్ వ్యాక్సిన్లు వేసి అదుపులో పెడుతామని జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు ప్రకటించారు. ఆదివారం జనసేన పార్టీలో మృతి చెందిన జనసేన కార్యకర్తల సభ్యులకు జనసేన కేంద్ కార్యాలయంలో బీమా చెక్కుల పంపిణీ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కులను అందజేశారు. కార్యకర్తలకు తన వంతుగా ఎంతో కొంత సాయం అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. 
 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యిందని, అపుడే వైకాపా వాళ్లు మొరగడం ప్రారంభించారని నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆయన జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వలేదని, ఎంతసేపూ దోచుకోవడం, దాచుకోవడమే వారి పని అని నాగబాబు హెచ్చరించారు. తాము కనీసం ఆరు నెలలు అయినా వేచిచూశామని, వైకాపా వాళ్లు నెల రోజులకే కుక్కల్లా వెంటపడుతున్నారని విమర్శించారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతామని అన్నారు. వైకాపా ప్రభుత్వం చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని, చేసిన అవినీతి, అక్రమాలకు చట్టపరంగా శిక్ష తప్పదని నాగబాబు హెచ్చరించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments