Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం కావాలంటే బీజేపీలో చేరాలి : అన్నం సతీశ్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (15:06 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి కావాలని, ఈ లక్ష్యం నెరవేరాలంటే ఆయన బీజేపీలో చేరాలని బీజేపీ నేత అన్నం సతీశ్ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ వచ్చే జనవరి నెలలోగా బీజేపీలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. 
 
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వస్తారని... ఆయన కోసం ఢిల్లీ నాయకులు కూడా ఏపీకి వస్తారన్నారు. పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందన్నారు. బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని... ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న అన్నం సతీశ్... ఈ మధ్యనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి. 
 
మరోవైపు, నవ్యాంధ్ర అమరావతి నిర్మాణం విషయంలో వైకాపాలోని ప్రభుత్వం వెనుకడుగు వేస్తే అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అన్నం సతీశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments