పవన్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.. రాజధానిపై ఏమన్నారో తెలుసా?

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (15:56 IST)
రాజధానిపై ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు షాకిచ్చే కామెంట్లు చేశారు.. ఆ పార్టీ ఎమ్మెల్యే. జ‌న‌సేన‌కు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఒక్క‌రే ఎమ్మెల్యే. అయితే అతను చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్రంలోనూ పార్టీలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. 
 
ఏపీకి మూడు రాజ‌దానుల అంశంపై ప‌వ‌న్ కుటుంబంలోనే రెండు అభిప్రాయాలున్నాయని రాపాక గుర్తు చేశారు. చిరంజీవి మూడు రాజ‌ధానుల అంశాన్ని స‌మ‌ర్థించార‌ని ఎమ్మెల్యే రాపాక గుర్తు చేసారు. రాజధానిపై జనసేన అధినేత పవన్ కల్యాన్ నిర్ణయంతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. 
 
తనకు పార్టీ నిర్ణయం కంటే తనను గెలిపించిన ప్రజలే ముఖ్యమని రాపాక వెల్లడించారు. పవన్ సైతం మూడు రాజధానులను వ్యతిరేకించడం లేదని. కానీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయాలని కోరుతున్నారని తెలిపారు. రాజధానులతో సామాన్యులకు పని ఉండదని మూడు రాజధానులతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు.
 
మరోవైపు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా చేయాలంటూ రైతులు ఆందోళ‌న‌లు చేస్త‌న్నారు. అలాగే కర్నూలును రాజధాని చేయాలని.. రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అది కాని పక్షంలో తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. కాదు కూడ‌ద‌నుకుంటే చిత్తూరు జిల్లాను కర్ణాటక లేదా తమిళనాడులో కలపాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments