Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.. రాజధానిపై ఏమన్నారో తెలుసా?

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (15:56 IST)
రాజధానిపై ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు షాకిచ్చే కామెంట్లు చేశారు.. ఆ పార్టీ ఎమ్మెల్యే. జ‌న‌సేన‌కు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఒక్క‌రే ఎమ్మెల్యే. అయితే అతను చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్రంలోనూ పార్టీలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. 
 
ఏపీకి మూడు రాజ‌దానుల అంశంపై ప‌వ‌న్ కుటుంబంలోనే రెండు అభిప్రాయాలున్నాయని రాపాక గుర్తు చేశారు. చిరంజీవి మూడు రాజ‌ధానుల అంశాన్ని స‌మ‌ర్థించార‌ని ఎమ్మెల్యే రాపాక గుర్తు చేసారు. రాజధానిపై జనసేన అధినేత పవన్ కల్యాన్ నిర్ణయంతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. 
 
తనకు పార్టీ నిర్ణయం కంటే తనను గెలిపించిన ప్రజలే ముఖ్యమని రాపాక వెల్లడించారు. పవన్ సైతం మూడు రాజధానులను వ్యతిరేకించడం లేదని. కానీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయాలని కోరుతున్నారని తెలిపారు. రాజధానులతో సామాన్యులకు పని ఉండదని మూడు రాజధానులతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు.
 
మరోవైపు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా చేయాలంటూ రైతులు ఆందోళ‌న‌లు చేస్త‌న్నారు. అలాగే కర్నూలును రాజధాని చేయాలని.. రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అది కాని పక్షంలో తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. కాదు కూడ‌ద‌నుకుంటే చిత్తూరు జిల్లాను కర్ణాటక లేదా తమిళనాడులో కలపాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments