ఓడిపోయినా... 2.88 లక్షల మంది ఆశీర్వదించారు : జనసేన లక్ష్మీనారాయణ

Webdunia
ఆదివారం, 9 జూన్ 2019 (08:29 IST)
తమ పార్టీతో పాటు తాను ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. లక్షలాది మంది ఓటర్లు వారి ఓటు హక్కుతో ఆశీర్వదించారని జనసేన పార్టీకి చెందిన వైజాగ్ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. ముగిసిన ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ, ఆయనకు 2,88,754 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఓటమికి గల కారణాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ సమావేశానికి హాజరైన జేడీ మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని, భవిష్యత్తులో జనసేన పార్టీ పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవకపోయినా, తనను 2,88,754 మంది ఓటుతో ఆశీర్వదించారని గుర్తుచేశారు. పార్టీ పరంగా కూడా కొద్దిసమయంలోనే ఇంత పురోగతి సాధించడం మామూలు విషయం కాదన్నారు. 
 
ఇక, సమీక్ష గురించి చెబుతూ, ఈసారి ఎన్నికల్లో జనసేనలో లోపాలు ఎక్కడెక్కడ వచ్చాయి అనే విషయాన్ని పవన్ కల్యాణ్ అందరితో చర్చించారని తెలిపారు. జనసేన ప్రతిపాదించిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ యువతలోకి వెళ్లిందని, ధనప్రభావం లేని రాజకీయాలపై యువతలో ఆసక్తి మొదలైందని అన్నారు.
 
గతంలో తాను రైతులను కలిసేందుకు పాదయాత్ర చేశానని, ఇకముందు కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్దకు కూడా వెళతామని సీబీఐ మాజీ జేడీ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments