Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ అంటే వ్యక్తిగతంగా ఇష్టం.. నా వెంట ప్రజలున్నారు.. బీజేపీ కాదంటున్న హీరో (Video)

తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో జనం అభిప్రాయం మరో రకంగా ఉందని చెప్పారు.

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (17:16 IST)
తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో జనం అభిప్రాయం మరో రకంగా ఉందని చెప్పారు. 
 
ఆయన మంగళవారం ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ బాగా బలహీనపడిందన్నారు. పైగా, తాను జనం కోసమే ఇప్పుడు మాట్లాడుతున్నానని, జనం సమస్యలపై పోరాడుతానని చెప్పుకొచ్చారు. 
 
తనకు సినిమాల్లో నటించడం కంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనే అమితానందం లభిస్తుందన్నారు. అందువల్ల ప్రజల కోసం, ప్రజా సమస్యలపై తాను పోరాడతానని అన్నారు. పైగా, తన వెంట బీజేపీ లేదా వైకాపా లేదని, కేవలం ప్రజలు మాత్రమే ఉన్నారనీ, వారికోసమే తాను మాట్లాడుతున్నట్టు పవన్ చెప్పారు. 
 
కాగా, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్‌పై టీడీపీ నేతలు ముప్పేట విమర్శల దాడిచేస్తున్న విషయం తెల్సిందే. బీజేపీ డ్రామాలో భాగంగానే పవన్.. టీడీపీ నేతలపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడుతున్నారు. బీజేపీతో పవన్ ములాఖత్ అయ్యారని, వైసీపీ, బీజేపీ, పవన్ ముగ్గురూ కుమ్మక్కై టీడీపీపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments