Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు, ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (21:24 IST)
సంక్రాంతి ముగిసినా జల్లికట్టు మాత్రం చిత్తూరు జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఆచారంగా సాంప్రదాయ క్రీడను ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు గ్రామస్థులు. ఇప్పటికే 10కి పైగా గ్రామాల్లో జల్లికట్టును నిర్వహించారు. డిసెంబర్ 25వ తేదీ నుంచే జల్లికట్టు ప్రారంభమై ఈ నెల చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది. 

 
కనుమ పండుగ సంధర్భంగా నిన్న నాలుగు గ్రామాల్లో జల్లికట్టు జరిగింది. ఈ రోజు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి, మల్లయ్యపల్లి, డోర్నకంబాలలో జల్లికట్టు జరిగింది. కోడిగిత్తలకు కట్టిన బహుమతులను పొందేందుకు ప్రయత్నించిన యువకులకు గాయాలయ్యాయి.

 
సుమారు 20 మందికి పైగా యువకులకు గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుప్రతికి తరలించారు. కోడిగిత్తల తలకు కట్టిన బహుమతులను పొందేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో యువకులకు గాయాలయ్యాయి. 

 
పోలీసులు మొదట్లో ఆంక్షలు విధించారు. జల్లికట్టు ఆడకూడదని హెచ్చరించారు. ఏర్పాట్లు చేసుకుంటున్న నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. అయినా గ్రామస్తులు పట్టించుకోలేదు. జల్లికట్టును కొనసాగించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మూడు గ్రామాల్లో జల్లికట్టు జరిగింది. వేలాదిమంది యువకులు జల్లికట్టును తిలకించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments