Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ధిక్కరణ కేసులో సబ్ కలెక్టరుకు ఆర్నెల్ల జైలుశిక్ష

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోర్టు తీర్పును యధేచ్చగా ధిక్కరిస్తున్నారు. అలాంటి వారికి ధర్మాసనం జైలుశిక్షలను విధిస్తుంది. ఇటీవల ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత వారు ప్రాధేయపడటంతో వారు యేడాదిపాటు సంఘ సేవ చేయాలంటూ ఆదేశించింది. 
 
తాజాగా ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. దీంతో వారికి ఒక ఆర్నెల్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వీరిలో రాజంపేట సబ్‌కలెక్టర్ ఖేతన్ గర్గ్, ఏపీఎండీసీ సీపీఓ సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. ఆరు నెలల జైలుతో పాటు రూ.2 వేల అపరాధం కూడా విధించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా ఓబులావారి పల్లె మండలం మంగంపేటలో 2003లో జరిగిన మైనింగ్ కారణంగా గ్రామానికి చెందిన నరసమ్మ తన ఇంటిని కోల్పోయింది. పరిహారం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించగా ఆమెకు చుక్కెదురైంది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. 
 
ఈ కేసును విచారించిన హైకోర్టు ఆమెకు పరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశించినప్పటికీ ఆమెకు మాత్రం పరిహారం అందలేదు.దీంతో ఆమె మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కోర్టు ధిక్కరణ చర్యల కింద ఇద్దరు అధికారులకు ఆర్నెల్లపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments