Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీర్యం నింపిన సింజరితో మహిళను గుచ్చిన వ్యక్తి.. 25 యేళ్ల జైలు.. ఎక్కడ?

Advertiesment
Amrican Court
, శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (09:31 IST)
కొన్ని నేరాలు విచిత్రంగా ఉంటాయి. కానీ అలాంటి నేరాలకు పడే శిక్షలు చాలా కఠినంగా, గరిష్టంగానూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తికి 25 యేళ్ల జైలుశిక్ష పడింది. వీర్యం నింపిన సిరంజితో మహిళను గుచ్చిన ఓ వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా న్యాయస్థానం తీర్పునిచ్చింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్ (52) అనే వ్యక్తి కిరాణా దుకాణానికి వచ్చిన మహిళకు స్టీమెన్ వెనుక నుంచి సిరంజితో గుచ్చాడు. ఆమెకు చురుక్కుమనడంతో ఏదో కుట్టిందని భావించిన బాధిత మహిళ నిందితుడిని ప్రశ్నించింది. దీనికి అతడు సిగరెట్‌తో కాల్చినట్టు చెప్పాడు. దీనిపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
అయితే, పోలీసులకు నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంలో పురుగు కుట్టినట్టు ఉంటుందని చెప్పాడు. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత విచారణలో అతడు వీర్యం నింపిన సిరంజితో దాడి చేసినట్టు తేలింది. అంతేకాదు, మరో ఇద్దరు మహిళలపైనా స్టీమెన్ ఇలానే దాడికి యత్నించినట్టు పోలీసులు గుర్తించారు. 
 
అలాగే, తన ముందు నడుస్తున్న 17 ఏళ్ల యువతిపై వీర్యం చల్లాడు. స్టీమెన్ ఇంటిని తనిఖీ చేసిన సమయంలో ద్రవంతో కూడిన ఓ సిరంజిని పోలీసులు గుర్తించారు. 9 సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్టీమెన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం తొలుత అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఈ శిక్షను పదేళ్లకు కుదిస్తూ తుదితీర్పు వెలువరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ కొత్త ఆవిష్కరణ జియోఫోన్ నెక్స్ట్ - వినియోగదారులకు షాక్