కారు కొనివ్వలేదని యాసిడ్ తాగిన యువకుడు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన ఓ యువకుడు ద్రావకం సేవించాడు. తల్లిదండ్రులు తాను కోరిన కారును కొనివ్వలేదన్న కోపంతో యాసిడ్ సేవించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, కోరుట్ల మండలం, కల్లూరులో సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సీపెల్లి భానుప్రకాష్ (22) గత కొంతకాలంగా కారు కొనివ్వాలని కుటుంబ సభ్యులను కోరుతూ వచ్చాడు. 
 
గత పక్షం రోజులుగా మరింత ఒత్తిడి చేయసాగాడు. అయితే, అతని మాటలను తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లి యాసిడ్ సేవించాడు. ఆ తర్వాత మంటలు తాళలేక కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. 
 
ఇది గమనించిన స్థానికులు భానుప్రకాష్‌న ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. గతంలో కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదని భానుప్రకాష్ చేయి కోసుకున్నట్టు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments