Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు కొనివ్వలేదని యాసిడ్ తాగిన యువకుడు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన ఓ యువకుడు ద్రావకం సేవించాడు. తల్లిదండ్రులు తాను కోరిన కారును కొనివ్వలేదన్న కోపంతో యాసిడ్ సేవించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, కోరుట్ల మండలం, కల్లూరులో సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సీపెల్లి భానుప్రకాష్ (22) గత కొంతకాలంగా కారు కొనివ్వాలని కుటుంబ సభ్యులను కోరుతూ వచ్చాడు. 
 
గత పక్షం రోజులుగా మరింత ఒత్తిడి చేయసాగాడు. అయితే, అతని మాటలను తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లి యాసిడ్ సేవించాడు. ఆ తర్వాత మంటలు తాళలేక కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. 
 
ఇది గమనించిన స్థానికులు భానుప్రకాష్‌న ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. గతంలో కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదని భానుప్రకాష్ చేయి కోసుకున్నట్టు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments