Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు కొనివ్వలేదని యాసిడ్ తాగిన యువకుడు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (11:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన ఓ యువకుడు ద్రావకం సేవించాడు. తల్లిదండ్రులు తాను కోరిన కారును కొనివ్వలేదన్న కోపంతో యాసిడ్ సేవించాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, కోరుట్ల మండలం, కల్లూరులో సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు సీపెల్లి భానుప్రకాష్ (22) గత కొంతకాలంగా కారు కొనివ్వాలని కుటుంబ సభ్యులను కోరుతూ వచ్చాడు. 
 
గత పక్షం రోజులుగా మరింత ఒత్తిడి చేయసాగాడు. అయితే, అతని మాటలను తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లి యాసిడ్ సేవించాడు. ఆ తర్వాత మంటలు తాళలేక కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. 
 
ఇది గమనించిన స్థానికులు భానుప్రకాష్‌న ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. గతంలో కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదని భానుప్రకాష్ చేయి కోసుకున్నట్టు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments