Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నారా?

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (19:54 IST)
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు చక్కని అవకాశం ఇచ్చింది. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని ఉన్నా, ఆర్థికంగా స్తోమతలేని వారికి జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అర్హులైన విద్యార్థులకు చేయూతనిస్తోంది. వరల్డ్ టాప్-100 విద్యాసంస్థలు, వర్సిటీల్లో అడ్మిషన్ సాధించినవారికి ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 
 
ఇక, 101 నుంచి 200 లోపు ర్యాంకు కలిగిన ప్రపంచ విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందినవారికి ఆయా విద్యాసంస్థల ఫీజులను అనుసరించి 50 శాతం ఫీజు కానీ, రూ.50 లక్షలు కానీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ మేరకు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
 
దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబరు 30. అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ వెబ్ సైట్ (https://jnanabhumi.ap.gov.in/)లో దరఖాస్తు చేసుకోవాలి.
 
క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో టాప్-200 లో ఉన్న విదేశీ వర్సిటీలు, విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ వర్గాల విద్యార్థులు జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలో 60 మార్కులు, లేదా, అందుకు సమానమైన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ చదవాలనుకునేవారు నీట్ రాసి అర్హత పొంది ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments