Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమవారిని రక్షించుకునేందుకే జగన్ ఢిల్లీ పర్యటన: దేవినేని

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:25 IST)
తన కేబినెట్‌లోని 8మంది మంత్రులతో పాటు వైసీపీ ఎంపీలపై ఐటీ దాడులు జరగకుండా ఉండేందుకే జగన్‌ దిల్లీ పర్యటకు వెళ్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడుతూ…  ఐటీ దాడుల నుంచి తమవారిని రక్షించుకునేందుకే సీఎం దిల్లీ పర్యటన అని విమర్శించారు.

అవినీతిలో కూరుకుపోయిన సీఎం జగన్‌.. అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే ఐటీ అధికారులు గుర్తించారని చెప్పారు. దొంగే.. దొంగా అన్నట్లు వైకాపా నేతల వ్యవహారశైలి ఉందని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదని.. ఆర్థిక అత్యయిక పరిస్థితి రాబోతోందని ఉమ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల రేషన్‌కార్డులు, 7లక్షల పింఛన్లు తొలగించి ఇప్పుడు రీవెరిఫికేషన్‌ డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments