Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ రోజువారీ ఆదాయం రూ.300 కోట్లు : మాజీ ఎంపి జెసి ఆరోపణ

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:43 IST)
టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎంపి జెసి దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయాలు కలుషితం అయ్యాయని, అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేస్తారనుకుంటే పొరపాటేనని అన్నారు. మంగళవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. సిఎం జగన్‌ ఒక్క రోజు ఆదాయం రూ.300 కోట్లు అని, అయితే ఇది ఎంతవరకు నిజమో.. తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

అభివృద్ధి చూసి వైసిపికి ఓటేశారని చెప్పడం అబద్ధమని, అదంతా వైసిపి నేతల దొంగ మాటలని అన్నారు. డబ్బులు లేనిదే ఎన్నికల్లో ఎవరూ గెలవలేరని, డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని, అయినా వైసిపితో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారని అన్నారు.

అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అందుకే కుప్పంలో టిడిపి ఓటమి పాలైందన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ పెద్దపల్లిలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యపై దివాకర్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో అన్ని ఆధారాలు ఉన్నా విచారణ ఎందుకని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments