Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింత కోతిలా జగన్ వ్యవహారం: సీపీఐ నారాయణ

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (08:27 IST)
ఏపీ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వింత కోతిలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.

మూడు ముక్కల రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నాశనం చేయడానికి, రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన లౌకికవాదుల మహగర్జన సభలో నారాయణ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి ముసుగులో తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పెద్దలను జగన్‌ కలుసుకుంటున్నాడని ఆయన విమర్శించారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్‌ పథకానికి 30శాతం నిధులు తగ్గించిందని, సాల్వెన్సీస్‌ సర్టిఫికెట్‌లతో పారిశ్రామికవేత్తలు తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేందుకు అనుకూలంగా ఉగ్ర ఆర్థిక బడ్జెట్‌ను తీసుకొచ్చిందని ఆరోపించారు.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ చట్టాలను తీసుకొస్తున్న నరేంద్రమోదీ, అమిత్‌షాలే దేశద్రోహులని నారాయణ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments