తిరుమలలో లైట్‌మెట్రో?

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (08:18 IST)
తిరుమలలో మరో అధునాతన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ లైట్‌మెట్రో ఏర్పాటు చేస్తే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందన్న నూతన ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

శ్రీవారి దర్శనార్థం లక్షలాది భక్తులు వస్తున్న తరుణంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా టీటీడీ ఈ తరహా ఆలోచన చేస్తోంది. ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన హైదరాబాద్‌ మెట్రోరైల్వే ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఈ దిశగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.

పెరుగుతున్న రద్దీని దృష్టిలోపెట్టుకుని రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదని టీటీడీ వివిధ రకాల ఆలోచనలు చేస్తోంది.

తిరుమల కొండకు మెట్రో రైలు ఏర్పాటు అంశాన్ని సుబ్బారెడ్డి లేవనెత్తగా కొండల్లో మెట్రో రైలు మార్గం సాధ్యం కాదని తేల్చిచేప్తూనే లైట్‌మెట్రో భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎన్వీఎస్‌ రెడ్డి అభిప్రాయపడినట్లు తెలిసింది. తిరుపతి రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ నుంచి శ్రీవారిమెట్ల మీదుగా తిరుమలకు లైట్‌ మెట్రో సౌకర్యవంతంగా ఉంటుందనే చర్చ జరిగింది.

అలానే తిరుపతి విమానాశ్రయం నుంచి అమరరాజ సంస్థ మీదుగా పాపనాశనం ద్వారా తిరుమలకు కూడా లైట్‌మెట్రో మార్గం సులభతరంగా ఉంటుందని ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. లైట్‌ మెట్రో  ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలించి తమకు నివేదిక ఇవ్వాలని సుబ్బారెడ్డి కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments