Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అబద్ధాలకోరు.. ప్రధాని సార్ జోక్యం చేసుకోండి.. జగన్

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (11:12 IST)
ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడును "అబద్ధాలకోరు"గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని.. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మందలించాలని కోరారు. 
 
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా సీఎం నాయుడు దిగజారిపోయారని ప్రధాని మోదీకి రాసిన ఎనిమిది పేజీల లేఖలో జగన్ ఆరోపించారు. నెయ్యి స్వీకరించడానికి తిరుమల-తిరుపతి దేవస్థానం (టిటిడి)లో చేపట్టిన ప్రక్రియను వివరిస్తూ, సీఎం స్థాయిని మాత్రమే కాకుండా, ప్రజా జీవితంలోని ప్రతి ఒక్కరిని, టిటిడి పవిత్రతను చంద్రబాబు దిగజార్చారని పైర్ అయ్యారు. 
 
ఈ వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని.. తిరుమల పవిత్రతను కూడా రాజకీయాల కోసం ఉపయోగిస్తున్న చంద్రబాబును మందలించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 
 
టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని లేఖలో కోరిన జగన్, సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయకపోతే చాలా తీవ్రమైన, విస్తృత పరిణామాలుంటాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments