Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

narendra modi

ఠాగూర్

, బుధవారం, 18 సెప్టెంబరు 2024 (12:11 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 21వ తేదీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. అమెరికా వేదికగా క్వాడ్ దేశాల సదస్సు జరుగనుది. ఇందులోపాల్గొనేందుకు ఆయన మూడు రోజుల పాటు అగ్రరాజ్య పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. విల్మింగ్టన్‌లో వేదికగా 4వ క్వాడ్ దేశాధినేతల సదస్సు జరుగనుంది. 
 
సెప్టెంబర 21న జరిగే క్వాడ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమివ్వనున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలకు, ఆకాంక్షలకు తోడ్పాటు అందించడంపై ఈ క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు. కాగా, వచ్చే ఏడాది క్వాడ్ దేశాల సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ అంగీకరించింది.
 
అమెరికాలో జరిగే తాజా క్వాడ్ సమావేశంలో, బైడెన్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ మరోమారు పోటీ చేయడంలేదన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు కూడా వీడ్కోలు పలకనున్నారు. క్వాడ్ దేశాల గ్రూపులో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. 
 
ఇక, క్వాడ్ సదస్సు అనంతరం, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 23వ తేదీన న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు. మెరుగైన రేపటి కోసం విభిన్న పరిష్కారాలు అనే అంశంపై ఈ ఐరాస సమావేశం ఏర్పాటుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లిళ్ల సీజన్.. రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు